ఏపీలో వెయ్యి దాటిన కొత్త కేసులు.. మరణాలెన్నంటే ?

by  |
corona
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 54,970 సాంపుల్స్ పరీక్షించగా 1,178మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,242కి చేరింది. అదే సమయంలో కరోనాతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాబారినపడి మరణించిన వారి సంఖ్య 13,935కు పెరిగింది. గత 24 గంటల్లో 1,266మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,94,855కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,70, 37,651సాంపుల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed