- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ వ్యాప్తి నివారణకు మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం, డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. మాస్క్ ధరించని వారికి రూ.100తో పాటు మాస్కు లేని వారిని దుకాణాలకు రానిస్తే యాజమాన్యానికి భారీ జరిమానా విధించాలని స్పష్టం చేసింది. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలకు రూ.10-25 వేల జరిమానాతో పాటు సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంతేకాదు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే 8010968295కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.
Next Story