- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : అనాథల బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని మహిళా సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో అనాథ పిల్లల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. అనాథలకు ప్రభుత్వమే తల్లిదండ్రిగా ఉండి, సంరక్షణ చేపట్టి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తీసుకొచ్చే నూతన విధానంలో ఎలాంటి అంశాలు ఉండాలో చెప్పాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం మార్గదర్శనం లో దేశం గర్వించే విధంగా అనాథల సంరక్షణ కోసం అద్భుత విధానం రానుందన్నారు. ఈ అభిప్రాయాలన్నింటిని క్రోడీకరించి కేబినెట్ సబ్ కమిటీ లో చర్చిస్తామని, అత్యుత్తమ విధాన రూపకల్పన కోసం ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు. రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితి గతులు మెరుగుపరచి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్, బాల నేరస్తుల శాఖ సంచాలకురాలు శైలజా, అనాథ పిల్లల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.