మైనార్టీల అభ్యున్నతే ధ్యేయం -ఉప ముఖ్యమంత్రి 

by  |
మైనార్టీల అభ్యున్నతే ధ్యేయం -ఉప ముఖ్యమంత్రి 
X

దిశ, ఏపీ బ్యూరో: మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ కింద ఉన్న హజరత్ సయ్యద్ షా ఖాద్రి మసీదును అభివృద్ధి చేయాలని పలువురు ముస్లిములు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బాషా మాట్లాడుతూ… ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు దర్గాను అభివృద్ది చేస్తామని చెప్పి 1500 గజాల భూమిని తీసుకుందని, ఇప్పటివరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని చెప్పారు. వీలైనంత త్వరగా మసీదును అభివృద్ధి చేస్తామని అంజాద్ హామీనిచ్చారు.



Next Story

Most Viewed