అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య

by  |
అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో డిగ్రీ చదువుతున్న అనూష, విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అనూష మరొకరితో చనువుగా ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అనూషను విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed