బాలికకు సెక్స్ కోరికలు పెరిగేందుకు ఇంజక్షన్లు ఇస్తూ.. 8 ఏళ్లుగా అత్యాచారం..

by  |
బాలికకు సెక్స్ కోరికలు పెరిగేందుకు ఇంజక్షన్లు ఇస్తూ.. 8 ఏళ్లుగా అత్యాచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: కామ వాంఛలతో మగాళ్లు మృగాళ్లు గా మారుతున్నారు. వావి వరుసలు, చిన్నా, పెద్ద మరిచి ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమ కోరికను తీర్చకపోతే చంపేస్తామనో, పర్సనల్ వీడియోలు నెట్లో పెడతామనో బెదిరిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెకు కోరికలు రేకెత్తేలా ఇంజెక‌్షన్లు.. మందుబిళ్లలు ఇస్తూ 8 ఏళ్ళుగా బాలికపై అత్యాచారం జరిపాడు ఓ కిరాతకుడు. అతనికి ఆమె భార్య కూడా సహకరించడం గమనార్హం. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తె(16) ఇంటర్ చదువుతుంది. ఆమె ఎనిమిదేళ్ల క్రితం అనగా 2015 లో కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా కిడ్నాప్ కి గురైంది. కిడ్నాప్ చేసిన దగ్గరనుంచి బాలికకు కామ కోరికలు రేకెత్తే ఇంజెక్షన్లు ఇస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ఎనిమిదేళ్ల ఆ బాలికకు ప్రత్యేక్ష నరకాన్ని చూపించారు. మత్తు నుండి బయటికి వచ్చిన ఆమె ఎన్నోసార్లు పారిపోవడానికి ప్రయిత్నించిన ఆమెపై బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇక ఎనిమిదేళ్ల తర్వాత బాలిక వారి చెర నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. తనను బంధించిన వారి గురించి పోలీసులకు తెలిపింది. బాలిక గా కిడ్నాప్ అయిన ఆమె యువతిగా బయటకొచ్చింది.

ఇద్దరు భార్యాభర్తలు తనను కిడ్నాప్ చేసారని, వారు తమకు తెలిసిన బంధువులే అని తెలిపింది. తనపై చాలా కిరాతకంగా ప్రవర్తించారని, తండ్రి, కొడుకులు తనపై అత్యాచారం చేస్తోంటే మహిళ వారిని ఎంకరేజ్ చేసేదని తెలిపింది. నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది.27 పేజీలతో కూడిన ఫిర్యాదును పోలీసులకు అందజేసింది. వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక తప్పిపోయిన కూతురు ఎనిమిదేళ్ల తర్వాత కనిపించేసరికి ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed