ప్రాణం మీదకొచ్చిన పాత కక్షలు.. వ్యక్తిపై మాజీ సర్పంచ్ దాడి

by  |
attacked, old factions
X

దిశ, మాక్లూర్: పాతకక్షలు ఓ వ్యక్తి ప్రాణంమీదకు వచ్చాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం రామచంద్రాపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒంటిరిగా ఉన్న భూషణ్‌పై మాజీ సర్పంచ్ బుర్రె గంగారాం, అతని కుమారుడితో కలిసి రాడ్డుతో దాడి చేశారు. దీంతో భూషణ్‌కు తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాత కక్షల నేపథ్యంలోనే దాడి చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed