జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

by  |
Omicron case
X

దిశ, మెట్‌పల్లి టౌన్ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని చావిడి ప్రాంతానికి చెందిన వ్యక్తి (34)కి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ నెల 25న శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో శాంపిల్ ఇచ్చిన బాధితుడికి సోమవారం ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లుగా జిల్లా వైద్యాధికారులు ధ్రువీకరించారు. అయితే బాధితుడిని వైద్య సిబ్బంది హైదరాబాద్ టిమ్స్‌కు తరలించేందుకు ప్రయత్నించగా.. ఆయన తిరస్కరించాడు. అయినా వైద్యాధికారులు బాధితుడికి నచ్చజెప్పి అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు.

Next Story

Most Viewed