కన్నకొడుకు పాలిట కాలయముడైన తండ్రి..

by  |
కన్నకొడుకు పాలిట కాలయముడైన తండ్రి..
X

దిశ నాగర్ కర్నూల్ : అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన కన్న తండ్రే పిల్లల పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్య గత మూడు నెలల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆదరణకు నోచుకోని పిల్లలను అన్నీ తానై పెంచాల్సిన తండ్రి అతి కిరాతకంగా చేతి మణికట్టు కోసి పీక పిసికి చంపాడు. మరో కొడుకు స్వల్ప గాయం కావడంతో బతికి బయటపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా మంతటి గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.

వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఎర్రమోని శివ కు గడ్డంపల్లికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వీరికి మల్లికార్జున్(5) ప్రణయ్(3) ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా గత మూడు నెలల క్రితం భార్య స్వప్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా ఇద్దరు పిల్లలను శివ పోషిస్తూ ఉండేవాడు. గురువారం తెల్లవారుజామున ఇద్దరు కుమారులు కుడు చెయ్యి మని కట్టులను కత్తితో కోసాడు. ప్రాణం పోలేదని పీకపిసికి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు పుల్లయ్య, అలివేల కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వెంటనే నానమ్మ అలివేల వెళ్లి చూసేసరికి ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడివున్నారు. చిన్న కుమారుడు ప్రణయ్ కళ్ళు తెరవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితుడిని గ్రామస్తులు చేతులు కట్టేసి చితక బాదారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed