విషాదం.. కొడుకు మృతదేహాన్ని చూసి తండ్రి మృతి

by  |
Died-dad-and-father
X

దిశ, మిర్యాలగూడ: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందగా.. కొడుకు మృతదేహాన్ని చూసి తండ్రి మృతి చెందిన హృదయ విధారక సంఘటన వేములపల్లి మండలం పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వేములపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన గొర్ల ఇంద్రారెడ్డి సీపీఎం పార్టీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా పని చేస్తూ పట్టణంలోని చైతన్యనగర్లో ఉంటున్నారు.

కాగా, అతని కుమారుడు భరత్ రెడ్డి(30) ఆదివారం మాడ్గులపల్లి మండలం బొమ్మకల్ గ్రామానికి బైక్ పై వెళ్లి తిరుగు ప్రయాణంలో వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పరిధి సాయి రమణ మిల్లు వద్దకు రాగానే నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన తండ్రి ఇంద్రారెడ్డికి కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెపోటు వచ్చింది. దీంతో పట్టణంలోని ప్రైవేట్ అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం భరత్ రెడ్డి మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వేములపల్లి పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు… కొడుకు మృతదేహాన్ని చూసి తండ్రి మృతి చెందడంతో వారి స్వగ్రామం తడకమళ్లతోపాటు చైతన్య నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి మృతదేహాలను సందర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed