కారు బీభత్సం.. ఒకరు మృతి

by  |
కారు బీభత్సం.. ఒకరు మృతి
X

దిశ, కాళోజీ జంక్షన్: హన్మకొండ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ్మ గడ్డ నుండి కాకతీయ యూనివర్సిటీ ప్రధాన రహదారిలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు మూడు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టి అదే స్పీడ్ తో వెళ్లి పోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకొని పోలీసులు గాయ పడ్డవారిని ఏంజీఏం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. కారు కోసం పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed