రైతు ఆత్మహత్య.. కారణం కడుపునొప్పి

by  |
రైతు ఆత్మహత్య.. కారణం కడుపునొప్పి
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కడుపు నొప్పి భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మండలం లోని సింగపూర్ శ్రీరాంనాయక్ తండాకు చెందిన లావుఢ్య దేవిదాస్ అనే రైతు పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. కడుపు నొప్పి భరించలేకనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Next Story