సీఎం తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. ఆయనకు ఈసీ నోటీసులు

by  |
Raja
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆయన తల్లిని ఉద్దేశించి రాజా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు అన్నాడీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో రాజాకు నోటీసులు జారీ చేసిన ఈసీ, బుధవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఎలాంటి ప్రస్తావన లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. షోకాజ్‌ నోటీసులు ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉండడమే కాకుండా మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్లుగా ఉన్నాయని, ఇది మోడల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ కింద తీవ్ర నిబంధనల ఉల్లంఘించినట్లుగా కనిపిస్తోందని కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది.

Next Story