పార్టీలన్నీ పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల కోసం వేట

by  |
Huzurabad
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఓట్ల సందడి మొదలైంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలవ్వగా.. ఓటర్లను వశం చేసుకునేందుకు అభ్యర్థులు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు. అంతేకాకుండా, ఇటు ప్రచారంపై దృష్టి పెడుతూనే.. మరో వైపు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను గుర్తించేందుకు సిద్ధమయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా మంగళవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు, వివిధ అనారోగ్య కారణాలతో ఓటింగ్ కి రాలేనివారు తదితరులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీనికోసం దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.


Next Story

Most Viewed