- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఓట్ల సందడి మొదలైంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలవ్వగా.. ఓటర్లను వశం చేసుకునేందుకు అభ్యర్థులు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు. అంతేకాకుండా, ఇటు ప్రచారంపై దృష్టి పెడుతూనే.. మరో వైపు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను గుర్తించేందుకు సిద్ధమయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా మంగళవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు, వివిధ అనారోగ్య కారణాలతో ఓటింగ్ కి రాలేనివారు తదితరులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీనికోసం దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
Next Story