వృద్ధ దంపతుల సజీవ దహనం

by  |
వృద్ధ దంపతుల సజీవ దహనం
X

దిశ, హుస్నాబాద్: తెల్లారేసరికి ఆ వృద్ధ దంపతుల బతుకు తెల్లారిపోయింది. దశాబ్దాలుగా కలిసే బతికినా వారిద్దరు.. మరణంలోనూ కలిసే పోయారు. ఇద్దరు ఒకటిగా బతికి.. ఒక్కరిగానే ప్రాణాలు వదిలారు. మాయదారికి కరెంట్ కు కన్ను కుట్టిందేమో.. ఆదమరిచి నిద్రపోతున్న ఆలుమగలును అనంత లోకాలకు తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇద్దరు వృద్ధ దంపతులు సజీవదహనం అయ్యారు.

తంగళ్లపల్లి గ్రామానికి చెందిన యాద నర్సయ్య(80), యాద లచ్చమ్మ(70) గురువారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు లేచాయి. ఆ మంటలు వారు నిద్రిస్తున్న గురిసెకు అంటుకున్నాయి. నిద్రలో ఉన్న వృద్ధులు వాటి నుంచి బయటపడలేక పోయారు. దీంతో మంటల్లో చిక్కుకుని ఇద్దరు సజీవదహనమయ్యారు. రాత్రి కావడంతో గ్రామస్తులు సకాలంలో స్పందించలేక పోయారు. వృద్ధ దంపతులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు

Next Story

Most Viewed