ఇంట్లోకి ట్రాక్టర్ దూసుకెళ్లి డ్రైవర్ మృతి

by  |
tractor crashed
X

దిశ, హుస్నాబాద్: ట్రాక్టర్ అదుపు తప్పి ఇంట్లోకి తీసుకెళ్లి వ్యక్తి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలను ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ వెల్లడించారు.
హుస్నాబాద్ పట్టణంలోని కస్తూరిబాకాలనీ (కేబీ) కాలనీ సమీపంలోని ప్రధాన రహదారి మూలమలుపులో ఇప్పట్ల వెంకటేష్ ఉన్నది. హుస్నాబాద్ పట్టణానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ (యజమాని) మెడబోయిన రాజు(37)కు ట్రాక్టర్‌ను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా అదుపు తప్పి మూలమలుపుతో ఉన్న వెంకటేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిందన్నారు.

ఈ ప్రమాదంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ (యజమాని) మెడబోయిన రాజు(37)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed