ఢిల్లీ హైకోర్టుకు ఆకతాయిల అంతరాయం..

by  |
ఢిల్లీ హైకోర్టుకు ఆకతాయిల అంతరాయం..
X

న్యూఢిల్లీ: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ అమలుకు వ్యతిరేకంగా నటి జూహిచావ్లా వేసిన పిటిషన్‌పై వర్చువల్‌గా విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు ధర్మాసనానికి ఆకతాయిలు పలుమార్లు ఆటంకం కలిగించారు. ఈ పిటిషన్‌పై వెబ్ ఎక్స్ ప్లాట్ ఫామ్ మీద వర్చువల్ కోర్ట్ రూమ్‌లో న్యాయమూర్తులు విచారణ జరిపారు. కాగా విచారణ జరుగుతున్న సమయంలో వర్చువల్ కోర్టు రూమ్‌లోకి కొందరు అన్‌నౌన్ పర్సన్స్ వచ్చి సినిమా పాటలు పాడటం మొదలు పెట్టారు. ఇలా బుధవారం మూడు సార్లు వారు కోర్టుకు అంతరాయం కలించారు. దీనిపై న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతరాయం కలిగించిన వ్యక్తులను గుర్తించాలని కోర్టు సిబ్బందిని జస్టిస్ మిధా ఆదేశించారు. వారిపై కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆ తర్వాత అప్రమత్తమైన సిబ్బంది కోర్టు రూమ్‌ను లాక్ చేశారు.


Next Story

Most Viewed