సత్తెనపల్లికి చేరుకున్న జవాన్‌ మృతదేహం.. నేడు గుడిపూడిలో అంత్యక్రియలు

by  |
Jawan Murali Krishna
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా–బీజాపూర్ సరిహద్దుల్లో గత శనివారం భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులో మందుపాతరలు పేల్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల జవాన్లు మృతిచెందారు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ శాఖమూరి మురళీకృష్ణ అమరుడైన సంగతి తెలిసిందే. తాజాగా.. జవాన్‌ మురళీకృష్ణ మృతదేహం సత్తెనపల్లికి చేరుకుంది. ముందుగా సత్తెనపల్లి పీఎస్‌లో మురళీకృష్ణ భౌతికకాయానికి పోలీసులు నివాళులర్పించారు. కాసేపట్లో మురళీకృష్ణ మృతదేహం స్వగ్రామం గుడిపూడి చేరుకోనుంది. మురళీకృష్ణ అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.



Next Story