హృదయ విదారక ఘటన.. తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

by  |
daughter
X

దిశ, చెన్నారావుపేట: వరంగల్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన తండ్రికి కూతురు తలకొరివి పెట్టింది. ఈ ఘటన జిల్లాలోని చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తుమ్మలపెల్లి స్వామి నర్సంపేటలో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయనకు భార్య కల్యాణి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో స్వామి మృతిచెందాడు. దీంతో ఆయనకు కొడుకులు లేకపోవడంతో తండ్రికి పెద్ద కూతురు తలకొరివి పెట్టింది. చిన్నారి కూతురు తలకొరివి పెట్టడాన్ని చూసిన గ్రామస్తులందరూ కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ అంత్యక్రియల్లో బర్ల దేవదాస్, సొసైటీ డైరెక్టర్ జంగిలి రాజు, నర్మెట సాంబయ్య, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed