అక్క కొడుకుతో ప్లాన్.. మంచంలోనే మామను కడతేర్చిన కోడలు

by  |
అక్క కొడుకుతో ప్లాన్.. మంచంలోనే మామను కడతేర్చిన కోడలు
X

దిశ, మానకొండూరు : మానవత్వాన్ని మరిచి తండ్రి లాంటి మామను కడతేర్చింది ఓ కోడలు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో కోడలు తన అక్క కొడుకుతో కలిసి మామను దారుణంగా హతమార్చిన ఘటన ఆదివారం తెల్లవారు జామున వెలుగులోకి వచ్చింది. కేశవపట్నం ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి కథనం ప్రకారం.. కాచాపూర్ గ్రామానికి చెందిన మాతంగి కనకయ్య (70) తన కుమారుడు మాతంగి తిరుపతి చనిపోయాక అతని భార్య కొమరమ్మతో గత కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో వేర్వురుగా ఉంటున్నారు.
ఓ గదిలో మామ కనకయ్య ఉంటుండగా.. కోడలు కొమరమ్మ గత కొన్ని రోజుల నుంచి మామకు సరిగ్గా తిండి పెట్టకుండా తరచూ గొడవ పడుతూ ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, ఈనెల 27వ తేదీన కొమరమ్మ అక్క కుమారుడు మాతంగి ప్రవీణ్‌తో కలిసి తన తండ్రిని దారుణంగా హత్య చేసినట్లు మృతుడి కుమార్తె మోర లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రశాంత్ రావు తెలిపారు. కాగా, మృతదేహాన్ని సీఐ కిరణ్ పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.



Next Story

Most Viewed