గాలిలో పెళ్లి తంతు.. మరి శోభనం ఎక్కడో..?

by  |
గాలిలో పెళ్లి తంతు.. మరి శోభనం ఎక్కడో..?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ నే పరిష్కారమని ఆలోచించిన ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలోను సంపూర్ణ లాక్ డౌన్ ని ప్రకటించాయి. ఇక ఇలాంటి సమయంలో బయటికి వెళ్లడమే కష్టం.. అలాంటిది ఇక పెళ్లిళ్లు అంటే ఇంకా కష్టం. మే నెల.. పెళ్లిళ్ల సీజన్.. కానీ ఏం లాభం. లాక్ డౌన్ వలన ఇరు కుటుంబ సభ్యులు తప్ప బయటివారిని పిలిచే అవకాశమే లేదు. అయినా పెళ్లిచేసుకొనేవారు ఆగుతున్నారా..? అంటే అది లేదు. వింత వింత విధానాలతో ఈ లాక్ డౌన్ లోనే వివాహమాడి.. నెట్టింట వైరల్ గా మారుతున్నారు. కొంతమంది కరోనా నియమాలను పాటిస్తూ వైరల్ అవుతుంటే .. ఇంకొంతమంది ఇదుగో ఈ జంటలా వైరల్ అవుతున్నారు. తాజాగా ఓ జంట తమ పెళ్లిని విమానంలో చేసుకొని నెట్టింట వైరల్ గా మారారు.

బెంగళూరు కి చెందిన రాకేష్, దక్షిణ ల వివాహం మే 24 న మధురైలో జరగాల్సిఉంది. ఈ వివాహం కోసం వధూవరులు, వారి కుటుంబసభ్యులు ఆదివారం బెంగళూరు నుంచి మదురైకి వచ్చే విమానంలో బయలు దేరారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం రేపటి (మంగళవారం) నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. దీంతో వారు వెనుతిరగక తప్పలేదు. అంతేకాకుండా పెళ్లిని కూడా రద్దు చేయాలనీ నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇరు కుటుంబాలు వధూవరులకు విమానంలోనే పెళ్లి చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా గాల్లో వెళుతున్న విమానంలోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు తాళి కట్టేశాడు.

ఇరు కుటుంబాల సమక్షంలో యువ జంట ఒక్కటైంది. కుటుంబ సభ్యులు వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు వింత వింత కామెంట్లు చేస్తున్నారు. పెళ్లైతే గాల్లో చేసుకున్నారు.. మరి శోభనం ఎక్కడ చేసుకుంటారో అని కొంతమంది అంటుంటే.. ఏమయ్యా పెళ్లి కొన్నిరోజులు వాయిదా వేస్తే ఏమవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed