దంపతుల ఆత్మహత్య.. వారి వేధింపులే కారణం!

by  |
దంపతుల ఆత్మహత్య.. వారి వేధింపులే కారణం!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరులో పురుగుల మందు తాగి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు లైఫ్ ఎనర్జీ స్కూల్ యజమాని సుబ్రహ్మణ్యం, రోహిణిలుగా గుర్తించారు. వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణం అంటూ మృతులు తీసిన సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. ఫీజులు వసూలు కాకపోవడం, పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో తీవ్ర మస్థానం చెంది, ఆత్మహత్య చేసుకుంటున్నాం అని సెల్ఫీ వీడియోలో వెల్లడించినట్లు తెలిపారు.


Next Story