కరోనా భయంతో కానిస్టేబుల్ మృతి

by  |
కరోనా భయంతో కానిస్టేబుల్ మృతి
X

దిశ, కంటోన్మెంట్: కరోనా భయం.. ఓ కానిస్టేబుల్‌ను బలి తీసుకుంది. గురువారం గాంధీ ఆసుపత్రిలో డ్యూటీలో చేరిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు వచ్చి, ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. వివరాళ్లోకి వెళితే… బోరబండలో నివాసం ఉంటున్న అంపోలు క్రాంతి కుమార్(27) బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను 2014 బ్యాచ్‌కు చెందినవాడు. కాగా ఈ నెల 26వ తేదీన క్రాంతి కుమార్‌కు కోవిడ్ కేంద్రంగా మారిన గాంధీ ఆసుపత్రిలో డ్యూటీ వేశారు.

ఈ క్రమంలోనే రాత్రి 8 గంటలకు అతను డ్యూటికి వెళ్లాడు. డ్యూటీలో రిపోర్ట్ చేసిన కొద్ది సేపటికి గుండె నొప్పి రావడంతో అతన్ని నిమ్స్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అతన్ని వైద్యులు పరిక్షించి, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే కోవిడ్ ఆసుపత్రిలో డ్యూటీ వేయడం మూలంగానే క్రాంతి మరణించి ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు.

Next Story