టీఆర్ఎస్‌కు షాక్.. బల్దియాలో పెరిగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు

by  |
టీఆర్ఎస్‌కు షాక్.. బల్దియాలో పెరిగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మినీ మున్సిపల్‌ ఫలితాలు నేడు వెల్లడవుతున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు, హైదరాబాద్‌లోని లింగోజిగూడ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అయితే.. ఈ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి 1,236 ఓట్లతో విజయం సాధించారు. మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన అవకాశం ఉంది. దీంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరింది. బీజేపీ కార్పొరేటర్ మృతితో ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే.


Next Story