ఘోరం.. మధ్యాహ్నం భోజనంలో బల్లి.. ఏకంగా 80 మంది పిల్లలు..

by  |
ఘోరం.. మధ్యాహ్నం భోజనంలో బల్లి.. ఏకంగా 80 మంది పిల్లలు..
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యాహ్న భోజనంలో అపశ్రుతి జరిగింది. పిల్లలు తినే భోజనంలో బల్లి పడింది. దాన్ని గమనించని సిబ్బంది అలాగే పిల్లలకు వడ్డించారు. దాంతో దాదాపు 80 మంది పిల్లలు అస్వస్థకు గురి అయ్యారు. వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కర్నాటకలోని హవేరి జిల్లా, రాణిబెన్నూర్ లో ఈ సంఘటన జరిగింది.

ప్రస్తుతం వారి పరిస్థితి బాగుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పట్ల చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం పాఠశాల హెచ్ఎం ను ఆదేశించింది.



Next Story