- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: కరోనాతో ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబాలకు 20 శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని ఆదేశించింది. ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా బాధితులకు రుణం అందనుంది. రుణాలు తీసుకున్నవారు 20% రాయితీ పోను మిగిలిన మెుత్తాన్ని 6%వడ్డీతో వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. రుణాలు పొందేవారికి కొన్ని నిబంధనలు కూడా విధించింది. మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు. కుటుంబంలో తల్లిదండ్రులు మరణించినా, సంపాదించే వ్యక్తి మరణించినా సాయం లభిస్తుంది. కుటుంబ పెద్ద కొవిడ్తో మరణించినట్టు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను గుర్తించి జాబితా పంపాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను (ఎన్ఎస్ఎఫ్డీసీ) కోరింది. ఈ నేపథ్యంలో ఏపీలో శనివారం నుంచి బాధిత కుటుంబాలను గుర్తించాలని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఎండీ నవ్య ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.