ఓఆర్ఆర్‌పై కంటైనర్‌ను ఢీకొన్న కారు

by  |
ఓఆర్ఆర్‌పై కంటైనర్‌ను ఢీకొన్న కారు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలిస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం కంటైనర్‌ను ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed