పెళ్లి లో అది చెప్పలేకపోయిన వరుడు.. వధువు చేసిన పని తెలిస్తే షాక్

by  |
పెళ్లి లో అది చెప్పలేకపోయిన వరుడు.. వధువు చేసిన పని తెలిస్తే షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి పీటల మీద పెళ్లిళ్లు ఆగడం చాలా చోట్ల చూసే ఉంటాం. అయితే ఆ పెళ్లిళ్లు ఆగిపోవడానికి కారణాలు చాలా బలంగా ఉంటాయి. కట్నాలు ఇవ్వలేదని, ప్రేమించిన అమ్మాయి/అబ్బాయి వద్దు అని వెళ్లిపోవడం, లేక ఎవరైనా వచ్చి పెళ్లిని ఆపుచేయడం లాంటివి సాధారణంగా జరుగుతుండేవే. అయితే ఎప్పుడైనా రెండో ఎక్కం పెళ్లి ఆపిందని విన్నారా? అదేంటీ రెండో ఎక్కం పెళ్లిని ఆపడం అనుకుంటున్నారా… అయితే ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ వింత సంఘటన గురుంచి తెలుసుకోవాల్సిందే.

కాన్పూర్ మహోబాజిల్లాలోని పన్వారీ ఏరియా ధావార్ గ్రామంలో ఒక కల్యాణ మండపం.. రెండు గంటలైతే పెళ్లి అయిపోతుంది.. పెళ్లిలో పంతులుగారు వధూవరులతో మంత్రాలు చదివిస్తున్నాడు. అయితే వధువు మంత్రాలూ చదువుతుంది కానీ వరుడు మాత్రం ఏదో పెదాలను కదుపుతున్నాడు. ఇది గమనించిన వధువు, వరుడును ఏమైందని అడిగింది.. ఈ మంత్రాలు, లెక్కలూ ఏంటీ.. ఇవన్ని అనడం ఎందుకు అంటూ గొణిగాడు. అది కాస్త పెళ్లి కూతురికి వినపడింది.. దీంతో తాను అవి అనడానికి మీకు ఎందుకు ఇబ్బంది..సాంప్రదాయబద్దంగా వాటిని అని తీరాలి అని చెప్పుకొచ్చింది.

పెళ్లికొడుకు నాకు ఇలాంటివి నచ్చవు అని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వధువు అయినా మీరేం చదువుకున్నారు.. నాకోసం రెండో ఎక్కం ఒక్కసారి చెప్తారా? అని అడిగింది. దీంతో ఆగ్రహానికి గురైన వరుడు రెండో ఎక్కం చదవడమేంటి ? చీప్ గా అంటూ హేళన చేశాడు. అయినా పట్టు వదలని వధువు రెండో ఎక్కం చదవాల్సిందేనని పట్టుబట్టింది. ఇంకా చేసేది లేక వరుడు ఎక్కం చెప్పడం మొదలుపెట్టి, తడబడ్డాడు. పూర్తిగా ఎక్కం చెప్పలేక చతికిలబడ్డాడు. దీంతో వధువు పెళ్ళిపీటల మీద నుండి లేచి తనకీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెగేసి చెప్పింది. కనీసం రెండో ఎక్కం కూడా సరిగ్గా రానివాడ్ని తనకిచ్చి కట్టబెడుతున్నారని ఆగ్రహంతో పెళ్ళిపీటలమీద నుండి లేచి వెళ్ళిపోయింది. ఈ అనుకోని సంఘటనతో పెళ్లి మండపంలో ఉన్నవారందరూ షాక్ అయ్యారు. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వధువు ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇలా రెండో ఎక్కం ఒక పెళ్లిని ఆపేసింది అన్నమాట..


Next Story

Most Viewed