ప్రేమించిన యువతిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు

by  |
murder
X

దిశ, అల్వాల్: ప్రేమించిన యువతిని ప్రేమికుడే కిరాతకంగా హత్యచేసిన సంఘటన మంగళవారం అల్వాల్​పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, ఇన్​స్పెక్టర్​ గంగాధర్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ ​అల్వాల్ సాయిబాబా కాలనీకి చెందిన లక్ష్మన్న, లక్ష్మిదేవి దంపతలు 20 సంవత్సరాల క్రితం కర్నూలు నుంచి బతుకుదెరువు కోసం అల్వాల్‌కు వలస వచ్చారు. వారి కూతురు సరస్వతి(18) బోయినిపల్లిలోని ఒమేగా డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే.. సరస్వతికి భూదేవినగర్‌కు చెందిన దీపక్ ​అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన సరస్వతి సాయంత్రం వరకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో సాయంత్రం సరస్వతి తల్లి లక్ష్మిదేవి అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ప్రారంభించారు.

ఫిర్యాదులో అనుమానితునిగా దీపక్ పేరు నమోదు చేయడంతో పోలీసులు దీపక్​ కోసం వెతకడం ప్రారంభించారు. స్నేహితుల ద్వారా దీపక్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడగా బీహెచ్‌ఈఎల్ కాలనీ సమీపంలోని రైల్వేట్రాక్ ​పక్కన సరస్వతిని హత్యచేసిన విషయం ఒప్పుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించగా మృతదేహం దొరికింది. మెడకు చున్నితో బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్​ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed