దైవ దర్శనంలో విషాదం.. బాలుడిని మింగిన కృష్ణానది

by  |
Sharuk
X

దిశ, నేరేడుచర్ల : కృష్ణానదిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మహంకాళిగూడెం పుష్కరఘాట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సైదులు గౌడ్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, వినుకొండకు చెందిన ముస్లిం కుటుంబం శుక్రవారం పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా దర్శనానికి వచ్చారు. దర్గా దర్శనానికి ముందు మహంకాళిగూడెంలోని కృష్ణానది పుష్కరఘాట్ వద్ద స్నానాలు చేస్తుండగా షారూక్ ( 14 ) ప్రమాదవశాత్తు కాలు జారి కృష్ణానదిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పడవలు, గజ ఈతగాళ్ల సాయంతో వెతకి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు గౌడ్ తెలిపారు .



Next Story

Most Viewed