పుట్టింటికి వచ్చిన మహిళకు కడుపు కోత

by  |
snake bite
X

దిశ,హుజూర్ నగర్: పాము కాటుకు 8 నెలల పసికందు మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ మండల పరిధిలోని బూరుగడ్డలో చోటు చేసుకుంది. పుట్టింటికి వచ్చిన మహిళకు కన్నకొడుకును పాము కాటేయడంతో కడుపుకోతను మిగిలింది. తల్లిదండ్రులు కారింగుల రామయ్య, అచ్చమ్మలను చూడటానికి‌ శిరీష భర్త జానకిరాములుతో కలిసి బూరుగడ్డ వచ్చింది.

శనివారం రాత్రి అప్పటివరకు‌ బయట పడుకున్న వారంతా వర్షం రావడంతో లోపలకు వెళ్ళి‌ గదిలో క్రింద పడుకున్నారు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చి బాలుడిని కాటు వేసి‌ వెళ్తున్న పామును వెంబడించి చంపారు. పాము కాటుకు గురైన బాలుడిని, పాముతో‌‌సహా హుటాహుటిన హుజూర్‌నగర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అక్కడ డ్యూటీ డాక్టర్ లేడని, వైద్యం చేయలేమని నర్సులు‌ చెప్పడంతో.. చేసేదిలేక స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్ళారు. అక్కడ కూడా డాక్టర్లు అందుబాటులో‌ లేకపోవడం బాలుడిని కోదాడ తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రభుత్వ హాస్పిటల్ లో సమయానికి వైద్యం చేసి ఉంటే‌ తమ కొడుకు బతికేవాడని‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు.


Next Story