నాటు బాంబులు పేలి ఆవులు మృతి

by  |
నాటు బాంబులు పేలి ఆవులు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్ : వేటగాళ్ల నాటు బాంబులకు మూగ జీవాలు బలవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో నాటు బాంబులు పేలి ఆరు ఆవులు మరణించాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం చందమామపల్లెలో నాటు బాంబు పేలింది

వివరాల్లోకి వెళ్తే.. చందమామపల్లెలో వేటగాళ్లు అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి మరో ఆవు బలైంది. దీంతో ఆవు ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆవు చనిపోయింది. మూగజీవాలపై క్రూరంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed