గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by  |

దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. ఎస్సార్ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న పంట భూముల్లో కుళ్లిపోయిన స్థితిలో ఆ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహానికి సమీపంలో కొంత నగదు, సెల్ ఫోన్, ఏటీఎం కార్డులను గుర్తించారు. మృతి చెంది పది రోజులు దాటి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. లభ్యమైన వస్తువుల ఆధారంగా పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed