రోడ్డుపై నగ్నంగా మృతదేహం.. తరువాత తెలిసింది ఏంటంటే..?

by Batti.Sumithra |

<p>దిశ, చార్మినార్ : పాతనేరస్థుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి దారుణహత్యకు పాల్పడిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసును నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, మృతుడు కార్వాన్​కు చెందిన పాతనేరస్థుడు ఆసిఫ్ గా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇస్లామియా కాలేజ్​ వెనుక భాగంలోని నడి రోడ్డు పై నగ్నంగా ఓ [&hellip;]</p>

రోడ్డుపై నగ్నంగా మృతదేహం.. తరువాత తెలిసింది ఏంటంటే..?
X

దిశ, చార్మినార్ : పాతనేరస్థుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి దారుణహత్యకు పాల్పడిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసును నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, మృతుడు కార్వాన్​కు చెందిన పాతనేరస్థుడు ఆసిఫ్ గా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇస్లామియా కాలేజ్​ వెనుక భాగంలోని నడి రోడ్డు పై నగ్నంగా ఓ యువకుడి మృతదేహాం పడి ఉందంటూ మార్నింగ్​ వాక్​లో ఉన్న స్థానికులు చూసి చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతుడి పడి ఉన్న ప్రదేశంలోకి ఎవరు వెళ్లకుండా పోలీసులు సీన్​ ఆఫ్​ ఆఫెన్స్​ చేపట్టారు.

డాగ్​స్క్వాడ్స్​తో పాటు క్లూస్​ టీంను రప్పించారు. మొదట గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యగా చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. మృతుడి గొంతు, పొట్ట, ఛాతి, నడుమ భాగాలలో 7నుంచి 8 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి నగ్నం ఇక్కడ పడ వేయడం పట్ల కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పక్కనే నిర్మాణుష్య ప్రదేశంలో టీషర్టుతో పాటు ట్రాక్​ ప్యాంట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతదేహం పడి ఉన్న తీరును బట్టి ఎక్కడో హత్యచేసి ఇక్కడ మృతదేహాన్ని పడవేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతదేహం ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో మంగళవారం రాత్రి మృతుడు టోలీ మజీద్​కార్వాన్​కు చెందిన ఆసీఫ్​(45)గా గుర్తించారు. పోలీసుల విచారణలో మృతుడిపై దొంగతనం కేసు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story