లక్నవరంలో గల్లంతైన వ్యక్తి మృత‌దేహం లభ్యం

by  |
లక్నవరంలో గల్లంతైన వ్యక్తి మృత‌దేహం లభ్యం
X

దిశ,వెబ్‌డెస్క్: ములుగు జిల్లా లక్నవరం చెరువులో గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుధాకర్ మృతదేహం శనివారం లభ్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి మూడు రోజులు సెలవులు రావడంతో తన స్నేహితులతో కలిసి లక్నవరం చెరువును సందర్శించేందుకు శుక్రవారం వచ్చారు. కాగా చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో సాయంత్రం ప్రమాదవ శాత్తు కాలు జారి చెరువులో సుధాకర్ పడిపోయారు. ఈత రాకపోవడంతో సుధాకర్ చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో సుధాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed