చేపలు పట్టడానికి వెళ్లి మూసీలోశవమై.. మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు..

by  |
చేపలు పట్టడానికి వెళ్లి మూసీలోశవమై.. మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు..
X

దిశ, శంకర్‌పల్లి : చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మూసివాగులో శవమై కనిపించిన సంఘటన మంగళవారం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంకర్‌పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామంతపూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం (42) రోజు మాదిరిగా ఈనెల 12న చేపలు పట్టడానికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఇంటికి తిరిగి రాకపోయేసరికి భార్య అనురాధ శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ లో తన భర్త ఇంటికి రాలేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బంధువులు, స్నేహితుల వద్ద ఆచూకీ కోసం గాలించనా ఫలితం లేకుండా పోయింది. అయితే మంగళవారం ఉదయం పత్తేపూర్ గ్రామ శివారులో గల మూసీ వాగులో శవమై తేలాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంకర్‌పల్లి ఎస్సై లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.


Next Story

Most Viewed