నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతు 

by  |
నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతు 
X

దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టులో నాటుపడవ మునిగిన దుర్ఘటనలో ఇద్దరు గల్లంతవగా ముగ్గురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సంపత్ (టాటా ఏసీ డ్రైవర్), ఇరవేని రాజబాపు (ట్రాలీ డ్రైవర్ ), కలవేని రమేష్, మచ్చ రవి, బొంతల రమేష్ క‌లిసి మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లారు. నాటు పడవ స‌హాయంతో చెరువులోకి దిగారు. ప్ర‌మాద‌వ‌శాత్తు పడవ నీటిలో మునగగా బొంతల రమేష్ , ఇరవేని రాజబాపు గల్లంతు అయ్యారు. కాగా సుంకరి సంపత్, కాలేవిని రమేష్ , మచ్చ రవిలు ప్రాణాలతో బయట పడ్డారు. గ‌ల్లంతైన వారి కోసం శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఆర్డీఓ రమేష్ ఆధ్వర్యంలో సింగ‌రేణి రెస్క్యూ బృందం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది.


Next Story