- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టులో నాటుపడవ మునిగిన దుర్ఘటనలో ఇద్దరు గల్లంతవగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సంపత్ (టాటా ఏసీ డ్రైవర్), ఇరవేని రాజబాపు (ట్రాలీ డ్రైవర్ ), కలవేని రమేష్, మచ్చ రవి, బొంతల రమేష్ కలిసి మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లారు. నాటు పడవ సహాయంతో చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు పడవ నీటిలో మునగగా బొంతల రమేష్ , ఇరవేని రాజబాపు గల్లంతు అయ్యారు. కాగా సుంకరి సంపత్, కాలేవిని రమేష్ , మచ్చ రవిలు ప్రాణాలతో బయట పడ్డారు. గల్లంతైన వారి కోసం శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఆర్డీఓ రమేష్ ఆధ్వర్యంలో సింగరేణి రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.
Next Story