బాలాపూర్ యువకుడి సాహసం.. గత రికార్డు బద్దలు

by  |
Balapur young man
X

దిశ, జల్‌పల్లి: కాశ్మీర్​నుంచి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్రను కేవలం 75 రోజుల్లోనే పూర్తిచేసి బాలాపూర్ యువకుడు రికార్డు సృష్టించాడు. గతంలో ఓ మహిళ 85 రోజుల్లో ఈ యాత్ర చేసి సృష్టించిన రికార్డును బాలాపూర్‌కు చెందిన ముచింతల సాయి రాజ్వం శీకర్ బద్దలు కొట్టాడు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రోజుల్లో కాశ్మీర్​టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్రకు గత సెప్టెంబర్​16వ తేదీన కాశ్మీర్​శ్రీనగర్​నుంచి శ్రీకారం చుట్టాడు. 22 ఏళ్ల వయసులో సాహసోపేత నిర్ణయం తీసుకుని 75 రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన పద్మావతి, సుధాకర్​దంపతుల కుమారుడు, పర్వతారోహకుడు ముచింతల సాయిరాజ్వంశీకర్ బీబీఎం వరకు చదివాడు.

Balapur young man

Next Story

Most Viewed