నిమ్మగడ్డ విషయమై.. ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం

by  |
నిమ్మగడ్డ విషయమై.. ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ భిశ్వభూషణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని అందులో పేర్కొన్నారు. అయితే, ఇటీవలే ఈ విషయమై గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించాల్సిందిగా ధర్మాసనం సూచించింది. దీంతో ఆయన రెండురోజుల క్రితం గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చి విషయాన్ని వివరించారు. దీంతో ఈ విషయమై పలువురు రాజ్యాంగ నిపుణులతో గవర్నర్ చర్చించి తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిస్తోంది. కాగా, ఎస్ఈసీ పునర్నియామక విషయమై ఏపీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed