కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ.. ఎందుకో తెలుసా?

by  |
కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ.. ఎందుకో తెలుసా?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో ఆమెను మరో ఆరునెలల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆమెను మరో ఆరు నెలలు పదవిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి జగన్ లేఖ రాశారు. ఈ లేఖలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో సీఎస్ మార్పు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై ప్రభావం చూపుతుందని అన్నారు. అందుకే ఆమెను మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగేలా చేయాలని సూచించారు. కాగా, సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం జూన్ నెలాఖరుతో ముగియనుంది. కరోనా నేపథ్యంలో రిటైర్ కావాల్సిన అధికారుల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. ఈ నేపథ్యంలో నీలం సాహ్ని పదవీకాలాన్ని కూడా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో ఆరునెలల పాటు ఆమె పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో వైఎస్ మరణించిన సమయంలో అప్పటి సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని కేంద్రం మూడు నెలలు పొడిగించింది. ఏపీ విభజన సందర్భంగా పీకే మహంతి పదవీకాలాన్ని నాలుగు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.

Next Story