‘అదేమి దేశ ద్రోహం కాదు’

by  |
supreme court
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ అభిప్రాయంతో విబేధించడం దేశద్రోహమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370పై కేంద్ర నిర్ణయంపై జమ్ము కశ్మీర్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్వగురు ఇండియా సంస్థ కార్యదర్శి రజత్ శర్మ, డాక్టర్ నేహ శ్రీవాస్తవలు అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌ను న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, హేమంత్ గుప్తాల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం సెడిషన్ కాదని తెలిపింది. అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను తోసిపుచ్చింది.

Next Story

Most Viewed