అది బాంబు పేలుడు కాదు: ఎస్పీ రమేశ్ రెడ్డి

by  |
అది బాంబు పేలుడు కాదు: ఎస్పీ రమేశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: రేణి గుంట వద్ద జరిగిన బ్లాస్ట్ బాంబు పేలుడు కాదని, పుకార్లు వస్తున్నట్టుగా అందులో ఎలాంటి కుట్ర లేదని ఎస్పీ రమేశ్ రెడ్డి తెలిపారు. అది ఒక కెమికల్ ఎక్స్ ప్లోజర్ అని చెప్పారు. రైల్వే లైన్ ఏర్పాటులో దాన్ని వాడుతారని పేర్కొన్నారు. వాడిన తర్వాత సరిగ్గా డిస్మాంటిల్ చేయకపోవడంతో ఘటన జరిగిందని వివరించారు. అయినప్పటికీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Next Story

Most Viewed