డీజీపీ గౌతం సవాంగ్‌లో ఆ మార్పు రావాలి- ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

by  |
డీజీపీ గౌతం సవాంగ్‌లో ఆ మార్పు రావాలి-  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కార్యాలయాలపై భౌతికదాడులు చేయడం మంచిది కాదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హితవు పలికారు. బీజేపీ తరుపున ఇలాంటి అనైతిక సంఘటనలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ చేసిన ఆరోపణలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. కానీ, వైసీపీ చేసిన భౌతిక దాడులపై స్పందించలేదన్నారు. ఇలాంటి విషయాల్లో డీజీపీలో మార్పు రావాలని సోము వీర్రాజు అన్నారు. ఇకపోతే మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి నివాసాలపై వైసీపీ నేతలు దాడులు చేసిన సంగతి తెలిసిందే.



Next Story