బంపర్ ఆఫర్.. రూపాయికే లీటర్ పెట్రోల్.. బారులు తీరిన వాహనదారులు

by  |
బంపర్ ఆఫర్.. రూపాయికే లీటర్ పెట్రోల్.. బారులు తీరిన వాహనదారులు
X

దిశ, వెబ్‌డెస్క్ : రూపాయికే లీటర్ పెట్రోల్ అనగానే వాహనదారులు బారులు తీరారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, ఆదిత్య థాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం డోంబివలీ యువసేన రూపాయికే లీటర్ పెట్రోల్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో థాణేలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులకు రూపాయికే లీటర్ పెట్రోల్ అందించారు.

aditya-Thakre

ఈ విషయం కాస్తా సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో వాహనదారులు బంక్ ముందు బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్‌నాథ్‌ వింకో నకాలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో లీటరు పెట్రోల్‌ రూ.50కే అందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వచ్చినవారికి ఇలా పెట్రోల్ అందజేశారు.

Next Story

Most Viewed