అరుణాచలం అడ్వెంచర్స్

by  |

డిస్కవరీ ఛానల్… అడ్వెంచరస్ షోకి కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హోస్ట్ బేర్ గ్రిల్స్ చేసే సాహసాలను చూసేందుకు చాలామంది ఎంతో ఇంట్రెస్ట్ చూపుతారు. అందుకే ఈ షోకి ఇంకొంచెం స్పైసీనెస్ యాడ్ చేసేందుకు వరల్డ్ సెలబ్రిటీస్‌ను ఎంచుకుని షో చేస్తుంటాడు బేర్ గ్రిల్స్. ఇంతకు ముందు ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సాహసం చేసి బేర్ గ్రిల్స్‌తో కలిసి కర్ణాటక బందీపూర్ అడవుల్లో షూటింగ్‌లో పాల్గొన్నాడు.

ఈ ప్రోగ్రామ్‌కు భారీ క్రేజ్ రాగా… తలైవా అడ్వెంచర్స్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రోగ్రాం ప్రసారంపై ప్రోమో రిలీజ్ చేసిన డిస్కవరీ ఛానల్.. బేర్ గ్రిల్స్, రజినీకాంత్‌లతో భారత అరణ్యంలోకి ప్రవేశించేందుకు మీరు సిద్ధమా? అంటూ అల్టీమేట్ ప్రోమోను విడుదల చేసింది. దీంతో తలైవా ఆన్ డిస్కవరీ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. డిస్కవరీ చరిత్రలోనే ఇలాంటి మాస్ ప్రోమోను చూడలేదని అంటున్న ఫ్యాన్స్.. తలైవా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందంటున్నారు. మార్చి 23 రాత్రి 8గంటలకు ప్రసారమయ్యే ఈ షో రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు.

Next Story

Most Viewed