బ్రేకింగ్.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి

by  |
బ్రేకింగ్.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు రెచ్చిపోయి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. కాంగ్‌పోక్పీ జిల్లా బి గామ్నోవ్‌లో బలగాల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులకు నిర్వహించిన అంత్యక్రియల్లో భారీగా జనం పాల్గొన్నారు.

ఈ క్రమంలో వారిపై అనూహ్యంగా ‘కుకి’ వర్గానికి చెందిన కొందరు ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతిచెందారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులతో అప్రమత్తమైన బలగాలు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story