ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

by  |
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్​ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, షోపియాన్ జిల్లాలలోని హదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంలో భద్రతా బలగాలు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై ఎదురుకాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. ఈరోజు తెల్లవారుజామున మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed