నైజీరియాలో 200మంది విద్యార్థులు కిడ్నాప్

by  |
నైజీరియాలో 200మంది విద్యార్థులు కిడ్నాప్
X

దిశ, వెబ్ డెస్క్ : నైజీరియాలోని ఓ పాఠ‌శాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. మారణాయుధాలతో వచ్చి ముష్కరులు పాఠశాలపై దాడి చేశారు. అయితే డబ్బు కోసంమే ముష్కరులు విద్యార్థులను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఇస్లామిక్ పాఠశాలపై దాడి చేసి దుండగులు రెండు వందల మందిని కిడ్నాప్ చేశారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టు పోలీసులు చెబుతున్నారు. 200మంది విద్యార్థులను అపహరించారు అని చెబుతున్నప్పటికీ స్పష్టంగా లెక్క తెలీలేదని నీజర్ రాష్ట్ర అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed