బయటపడిన ఉగ్రవాదుల సొరంగం!

by  |
బయటపడిన ఉగ్రవాదుల సొరంగం!
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులకు చెందిన పెద్ద సొరంగం బయటపడింది. ఆదివారం భద్రతా బలగాలు దానిని గుర్తించాయి. దీంతో పాకిస్థాన్‌కు ఉగ్రవాదులతో సంబంధమున్నట్లు మరోసారి రుజువైనట్లు అధికారులు చెబుతున్నారు.

అంతర్జాతీయ సరిహద్దు పాకిస్థాన్ నుంచి ఈ సొరంగం ఉన్న ప్రదేశం జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టర్‌లో వెలుగుచూసింది. నగ్రోటాలో హతమైన నలుగురు జైషే ఉగ్రవాదులు సుమారు ఐదు ఫీట్ల వ్యాసంతోనున్న ఈ టన్నెల్ గుండానే కశ్మీర్‌లోకి చొరబడినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ సొరంగం కొన్ని చోట్ల విశాలంగా ఉన్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి.



Next Story

Most Viewed