‘ఉగ్ర’టాప్ కమాండ‌ర్ హతం

by  |
‘ఉగ్ర’టాప్ కమాండ‌ర్ హతం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సైఫుల్లాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై ఐజీపీ విజయ్ కుమార్ స్పందిస్తూ ‘భద్రతా దళాలు, పోలీసులు నేడు గొప్ప విజయాన్ని సాధించారు. హిజ్బుల్ చీఫ్‌ను హతమార్చడం చిన్న విషయమేమీ కాదు’ అని అన్నారు. ఈ ఏడాది మే నెలలో రియాజ్ నాయికూను హతమార్చిన తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ బాధ్యతలను సైఫుల్లా తీసుకున్నారు. ఈయన కశ్మీర్‌ లోయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా కొనసాగారు. దక్షిణ కశ్మీర్‌ను శ్రీనగర్ శివారులో వచ్చి సైఫుల్లా ఓ ఇంట్లో తలదాచుకుంటున్నట్టు సమాచారమందగానే కార్డన్ సెర్చ్ నిర్వహించారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే సైఫుల్లా కాల్పులు తెగబడ్డారని, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా హిజ్బుల్ చీఫ్ హతమయ్యారని వివరించారు. తమకు అందిన సమాచారం ప్రకారం, 95శాతం మృతిచెందిన ఉగ్రవాది డాక్టర్ సైఫుల్లానే అని విజయ్ కుమార్ తెలిపారు.


Next Story

Most Viewed